ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Published: Saturday January 28, 2023
బోనకల్, జనవరి 27 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆద్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం వారి సహకారముతో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ముష్టికుంట్ల గ్రామంలో శుక్రవారం పాఠశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ ఉచిత వైద్య శిబిరం ముష్టికుంట్ల పాఠశాల నందు నిర్వహించటం జరిగినది. ఈ వైద్య శిబిరాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారి బి. చలపతిరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమములో వాసిరెడ్డి మోహనరావు , అధ్య హాస్పిటల్ సిబ్బంది వెంకటకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.