ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

Published: Tuesday March 08, 2022
జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 07 మార్చి ప్రజాపాలన : ప్రజావాణికి వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో తహసీల్దార్లతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 218 మంది ప్రజలకు సంబంధించిన ధరణి, దళిత బంధు, రైతుబంధు, డబుల్ బెడ్రూమ్, వైద్య ఆరోగ్య శాఖ, సీసీ రోడ్డు, ఎస్సీ కార్పొరేషన్, సమస్యలకు దరఖాస్తులను జిల్లా కలెక్టర్ నిఖిల స్వీకరించారు. ధరణి సమస్యలపై ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించుటకు తహసీల్దార్లను ఆదేశించారు. ఇందులో ధరణికి సంబంధించిన దరఖాస్తులు తహసీల్దార్లు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, ఆర్డిఓ విజయకుమారి, తాండూర్ ఆర్డిఓ అశోక్  కుమార్, కలెక్టరేట్ ఏ ఓ హరిత అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.