బాలికల ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం ప్రభుత్వ మండల వైద్యాధికారి ప్రసాదరావు

Published: Tuesday November 08, 2022
 జన్నారం, నవంబర్ 07, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాలలోని  పదవ తరగతి బాలికలకు వైద్య శిబిరంలో ఏటానస్ డిఫ్తీరియా వ్యాక్సిన్ ను సోమవారం ప్రభుత్వ మండల వైద్యాధికారి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికలకు ఎటానస్ డిఫ్తీరియా వాక్సిన్ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఏఎన్ఎం కల్పన,  పద్మజ, ఉపాధ్యాయురాలు, విద్యార్థిరాలు, తదితరులు పాల్గొన్నారు.