సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు...

Published: Monday January 10, 2022

బీరుపూర్, జనవరి 09 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రేకులపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతుల కష్టాలను చూసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఖరీఫ్ మరియు రభి కాలాలలో పెట్టుబడుల సాయం కింద రైతుబందు మరియు రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టి రైతులకు పెద్దన్నగా ఉండడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ శాఖా అధ్యక్షులు మరియు గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గ్రామ టిఆర్ఎస్ నాయకులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.