10 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులు ప్రారంభోత్సవం

Published: Tuesday March 16, 2021
మేడిపల్లి, మార్చి 15 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్ శివ సాయి నగర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులు అంచనా వ్యయం రూ10 లక్షలతో సిసి రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ కౌడే పోచయ్యతో కలిసి పట్టణ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీీీ, విద్యుత్, మంచినీళ్లల వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.