భారత కమ్యూనిస్ట్ పార్టీ నూతన కార్యాలయమును ప్రారంభించి.కర్నాటి భాను

Published: Monday June 13, 2022
పాలేరు జూన్ 12 ప్రజాపాలన ప్రతినిధి
అజయతండ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన కర్నాటి బానుప్రసాద్!!                                  ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయతండ గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నూతన కార్యాలయమును ప్రారంభించిన సిపిఐ నేలకొండపల్లి మండల కార్యదర్శి కర్నాటి బానుప్రసాద్. ఈ సభకు కనకబండి శీతరాములు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా కర్నాటి బానుప్రసాద్ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీని ఒక బలమైన శక్తిగా తయారు చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే గ్రామ పంచాయతి ఎన్నికలలో, ఎం పి టి సి,జడ్ పి టి సి ఎన్నికలలో అధిక సంఖ్యలో సీట్లు గెలిచేందుకు ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. ఇంకా ఈ సభలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు సిద్దినేని కర్ణకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నేలకొండపల్లి మండల సిపిఐ నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు,బాగం నరసింహారావు,మేకల పుల్లయ్య,పాల్తియా శ్రీను,రాయల మాధవరావు,కాశబోయిన అయోధ్య,తేజావత్ రూప్లా,తేజావత్ బాలాజి,సోమ్లి,బానోతు క్రిష్ణ, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.