పగడ్బందీగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్న టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్.

Published: Friday June 11, 2021

వైయస్సార్ చౌరస్తా వద్ద వెహికల్ చెకింగ్.
మధిర, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు.కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలను ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పగడ్బందీగా అమలు చేస్తున్న మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్. గురువారం సాయంత్రం వైఎస్సార్ చౌరస్తా వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల అతిక్రమించి అనవసరంగా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 25 మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. అదే విధంగా మరో 20 ఫైన్లు విధించడం జరిగిందన్నారు. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలకు సహకరించాలని ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు.