దళిత ఎం పీ పి అని చులకనగా చూస్తే సహించం

Published: Wednesday December 08, 2021
బహుజన గిరిజన సాధికారత సంస్థ అధ్యక్షుడు గంధం పుల్లయ్య
బోనకల్ డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ ఎం పి పి కంకణాల సౌబాగ్యం ఒక దళిత రాలు అనే ఉద్దేశం తో ప్రోటో కాల్ పాటించకుండా చులకనగా చూస్తే సహించేది లేదని దళిత గిరిజన బహుజన సాధికారత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య బోనకల్ మండలం గార్లపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఇసందర్భంగా మాట్లాడుతూ వార్త పత్రికలో వచ్చిన వార్త కథనాన్ని స్పందించి ఒక మండలానికి ప్రథమ పౌరురాలు గా వున్న ఎంపీపీ ని ప్రభుత్వ కార్యక్రమాలకు అహ్వానించక పోవటం ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ అధికారులు అగౌరవంగా వ్యవహరించడం సరికాదని సామాజిక వర్గ పరంగా ఆలోచించి చులకనగా చూడటం సరికాదని ఆమెకు ఇవ్వవలసిన తగిన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరికూటి బాలు, విజయరాజు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.