రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు, భయాందోళనలో ప్రజలు

Published: Wednesday May 19, 2021
గుమ్మడిదల, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలంలో రోజు రోజుకు కరోనా కేసులు, ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం మండల వ్యాప్తంగా 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామాల వారీగా వివరాలను వెల్లడించారు. కానుకుంట గ్రామంలో 5, అనంతారం లో 2, దో మడుగులో 1, గుమ్మడిదల లో 1, బొంతపల్లి లో 4 చొప్పున మొత్తం 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.