కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
Published: Wednesday January 11, 2023
బెల్లంపల్లి జనవరి 10 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన అధికారులతో, ప్రజా ప్రతినిధులతో, ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
రెండవవిడత కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నందున, రోజూవారీ షెడ్యూల్ ప్రకారం, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి, సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, బి ఆర్ ఎస్ నాయకులు, ఆర్డిఓ శ్యామలదేవి, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి జనవరి 10 ప్రజా పాలన ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
Share this on your social network: