ఐఐటి లో సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన జాడి మురళి

Published: Monday March 06, 2023

జన్నారం, మార్చ్ 05, ప్రజాపాలన: మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన బి ప్రతిమ చదువుకున్న విద్యార్థి ఇటీవల ఐఐటి డిమ్ము కాశ్మీర్ లో సీటు సాధించినందుకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాడి మురళి సన్మానించారు. ఆదివారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిమను ఆమె తండ్రి ఆ పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. ప్రభుత్వ పాఠశాల నుండి ఐఐటీలో సీటు సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు  , తోటి విద్యార్థులు ఆ విద్యార్థిని అభినందించారు.