రహదారిపై నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న సర్పంచ్ దారిశెట్టి రాజేష్

Published: Wednesday July 13, 2022
కోరుట్ల, జూలై 12 ( ప్రజాపాలన ప్రతినిధి ):
గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మాదాపూర్ నుండి చిన్న మెట్ పల్లి రహదారిపై ఉన్నటువంటి కొడిదెల ఓర్రె నిండడం తో నీటి ప్రవాహం రోడ్డుపై  ఎక్కువగా  ఉండడం వలన, జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు దారిశెట్టి రాజేష్  పరిశీలించి అలాగే చిన్న మేట్ పల్లి నుండి మాదాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. ఇరు గ్రామాల ప్రజలందరూ గమనించి, అవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కృష్ణా రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ మల్ రెడ్డి ,టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.