ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి *తెలంగాణ టి యు డబ్ల్యూ జే రాష్ట్ర మహాసభలకు ఇబ్

Published: Monday January 09, 2023

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టి యు డబ్ల్యూ జే (143) యూనియన్ తరపు నుండి మెదక్ జిల్లా పటాన్ చెరువు జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ద్వితీయ రాష్ట్ర మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి అధ్యక్షులు సురమోని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం  మున్సిపల్ చౌరస్తా వద్ద డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా జాయింట్ సెక్రెటరీ  చెరుకూరి మహేందర్, జిల్లా కోశాధికారి చెరుకూరి రాజు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతను చాటి చెప్పడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని, రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపుమేరకు ఈ మహాసభలను విజయవంతం చేయడానికి తమ వంతు కృషిగా ఇక్కడికి వచ్చామని ఇకముందు కూడా టియుడబ్ల్యూజే నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ఇదేవిధంగా తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ జర్నలిస్టు నాయకులు వరికుప్పల అశోక్, హరికృష్ణ రెడ్డి, పంది సుదర్శన్, పంది క్రాంతి కుమార్, చెరుకూరి మల్లేష్, సురమోని బాబు, హనుమంతు సుదర్శన్, సొప్పరి యాదగిరి, అల్లంపల్లి సురేష్, నల్లోల్ల కిషన్,  బస్వపురం దశరథ, శ్యాంమ్ సన్, జుబ్బుర్ కుమార్, గుండె రాఘవేందర్, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రామ్ చందర్, యారా గణేష్ తదితరులు పాల్గొన్నారు.