ఎస్ సి రిజర్వేషన్ ను 15 శతం నుండి 25 శాతము కు పెంచాలి శంకరపట్నం నవంబర్ 08 ప్రజాపాలన ప్రతినిధి:

Published: Thursday November 10, 2022
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆద్వర్యం లో ఈ రోజు జరిగిన సమావేశం లో మండల అద్యక్షుడు గొట్టె అర్జున్ మాట్లాడుతు ..ఎస్సీ ల రిజర్వేషన్ లను 15 నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్ట్ సోమవారం నాడు వెలువవరించిన రిజర్వేషన్ లా పై న్యాయవాదుల  బిన్నబిప్రాయాలను సమీక్షించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యాక్షడు బూర్ల మొగిలి మండల ప్రదాన కార్యదర్శి దేవునూరి కుమారస్వామి, జనగాం బుచ్చయ్య గౌడ్, చింతం సదయ్య, తధితరులు పల్గొన్నారు.