టి ఎస్ ఆర్ టి సిఉత్తమ ఉద్యోగులకు సన్మాన
Published: Wednesday November 30, 2022
సభ మధిర నవంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుటిఎస్ఆర్టిసి మధిర డిపో నందు ఉత్తమ ఉద్యోగులకు పురస్కారం అందించడం జరిగింది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కండక్టర్లకు అదేవిధంగా ఇంధన పొదుపులో ఇందును పొదుపు చేసిన ఉత్తమ డ్రైవర్లకు క్యాష్ అవార్డులు అందించడం జరిగినది . ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్ కండక్టర్లు జోగేశ్వరరావు, శేషయ్య ,అబ్బాస్ మియా, బాలకృష్ణ, రాధిక, బేబీ, పి ఆర్ కుమార్,బండి శ్రీను , టి పద్మావతి ,ఎస్ రవి, బి లక్ష్మీనారాయణ, కే రామకృష్ణ శ్యాంబాబు, భాస్కరరావు, నాగేశ్వరరావు, పిఎన్ రావు లకు క్యాష్ అవార్డులతో పాటు ప్రశాంత పత్రాన్ని డిపో మేనేజర్ దేవదానం గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మిగిలిన ఉద్యోగులు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి డిపో, సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరినారు.ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది సూపర్వైజర్లు సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్ కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: