రెబ్బెన మండలం లో పోలీసులు మీకోసం

Published: Monday February 14, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 13 (ప్రజాపాలన ప్రతినిధి) : జిల్లాలోని రెబ్బెన మండలం లో గల ఖైర్ గాం, నేర్పేల్లి, గ్రామాలలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ వారి సౌజన్యంతో ఆదివారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఖైర్ గాంలో 6 సీసీ కెమెరాలు, నేర్పేల్లి లో 3 సీసీ కెమెరాలు, ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిపట్ల జరిగే ప్రతి ఒక్క నేరం కూడా అందులో నిక్షిప్తమై ఉంటుందని, సీసీ కెమెరాలు ఉండడం వల్ల ప్రజలలో ఏతప్పు చేయాలన్నా భయం ఉంటుందన్నారు. గ్రామం ఎల్ల వేళలా నిఘా నేత్రంలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సి ఐ సతీష్ కుమార్, ఎస్ఐ భవాని  సెన్, ఖైర్ గాం గ్రామ సర్పంచ్ మానెం కార్తీక్, కొండపల్లి సర్పంచ్ ఒరేయ్ శాంతా పోచం, మహేష్