కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Thursday December 01, 2022
చౌటుప్పల్ నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): యాదద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయితీకి సంబందించిన రెవిన్యు సర్వే నెంబర్ల గెజిట్ నమోదు2018 ప్రకారం సర్వే నెం 266, 268, 269, 270, 290లో విస్తీర్ణం73.24 గల భూమి లింగోజిగూడెం రెవిన్యు గ్రామంలో నమోదు చేసినారు. ఇట్టి సర్వే నెంబర్లను రద్దుచేసి, మరలా యధావిధిగా అంకిరెడ్డిగూడెం రేవిన్యూలో గెజిట్ 2022 ప్రకారం నమోదు చేయించినందుకు మున్సిపల్ శాఖ మంత్రి
కల్వకుంట్ల తారక రామారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఏర్పంచ్ సూర్వీ మల్లేష్ గౌడ్,గ్రామశాఖ టీ ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు సుర్వి విజయ్,నాయకుల భీమగోని మల్లేష్, వార్డు సభ్యులు భీమగోని అండాలు, బొమ్మని స్వామిగౌడ్, అంతటి వెంకటేశం, మోడపు జంగయ్య, ప్రసాద్,నాగేష్, మహేష్, రమేష్, పల్చమ్ వెంకటేశం, అంజయ్య, బుషిగంపల సురేష్, మల్లేష్,పందుల మణికుమార్,సూర్వీ రవికిరణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.