ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి అయ్యప్ప స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి

Published: Thursday December 01, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం చింతపట్ల గ్రామ శ్రీనివాస్ స్వామి  నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ,  అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు, అయ్యప్ప స్వామి కృప వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుభిక్షంగా ఉండాలని *మర్రి నిరంజన్ రెడ్డి  వేడుకున్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సరితా పాండురంగారెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమలాకర్ రెడ్డి, చరణ్ ముదిరాజ్, రామకృష్ణ మరియు వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.