ప్రెస్ క్లబ్ సభ్యత్వ నమోదు కోసం అడ్ హక్ కమిటీ ఏర్పాటు

Published: Thursday February 25, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 ( ప్రజాపాలన ) : వికారాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సభ్యత్వ నమోదు కోసం నూతన అడ్ హక్ కమిటీని సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని రత్నారెడ్డి గార్డెన్ లో ముద్రణ, దృశ్య ప్రదర్శన ప్రసార మాధ్యమాల ( ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ) జిల్లా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాత్కాలిక అడ్ హక్ కమిటీ  సభ్యులుగా నవతెలంగాణ జిల్లా స్టాఫర్ రవీందర్, నినాదం జిల్లా స్టాఫర్ కొత్తపల్లి శ్రీధర్, సూర్య జిల్లా స్టాఫర్ రాఘవేందర్, మన తెలంగాణ జిల్లా స్టాఫర్ గోపాల్, టైమ్స్ టుడే జిల్లా స్టాఫర్ కోటపల్లి నర్సిములు, నమస్తే తెలంగాణ ఆర్ సి ఎన్కతల రవి, టి న్యూస్ జిల్లా స్టాఫర్ నర్సిములు, ఎన్ టివి జిల్లా స్టాఫర్ షఫీ, సాక్షి జిల్లా స్టాఫర్ మహేందర్, ఏబిఎన్ జిల్లా స్టాఫర్ సత్యం లు కొనసాగుతారు. వీరు ప్రతి మండలానికి వచ్చి మండల రిపోర్టర్ల సభ్యత్వ నమోదు కొరకు జాబితా తయారు చేస్తారు. జిల్లా ప్రెస్ క్లబ్ లో చేరాలనుకునే ప్రతి విలేఖరి రూ.200 లు సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి విలేఖరికి ప్రెస్ క్లబ్ తరపున ఐడెంటిటీ కార్డు త్వరలో అందజేయబడును.