దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తిండేరు హనుమంతరావు దంపతులు
Published: Wednesday October 13, 2021
మేడిపల్లి, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రామంతాపూర్ గణేష్ నగర్లోని వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు తిండేరు హనుమంతరావు సతీమణి సురేఖ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: