అన్నం పరబ్రహ్మ స్వరూపం

Published: Friday September 16, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 15 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దాచేపల్లి ముత్యాలు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న వినాయకుడి గుడి వద్ద దాతలు దాచేపల్లి పణీ కుమార్ సునీత ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు దాతల సహకారంతో అన్నదానాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులను ఆయన అభినందించారు. అన్నదానాలకు ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సీనియర్ నాయకులు పల్లబోతు ప్రసాదరావు దాచేపల్లి మురళీకృష్ణ నంబూరు రాము మురళి కోన జగదీష్ చలవాది శ్రీనివాసరావు దొడ్డా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.