మర్రి రామారావు తల్లి మృత దేహాన్ని నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Published: Saturday September 24, 2022
బోనకల్, సెప్టెంబరు 23 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మర్రి రామారావు తల్లి మరణించడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రామారావు తల్లి మృత దేహాన్ని సందర్శించి ఆమెకు ఘన నివాళి అర్పించారు.నివాళి అర్పించిన వారిలో టిపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామ కోటేశ్వరరావు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు నల్లమోతు సత్యనారయణ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా బద్రు నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.