చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
Published: Wednesday July 13, 2022
మధిర జులై 12 ప్రజా పాలన ప్రతినిధి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామని మధిర సీఐ వడ్డేపల్లి మురళి మంగళవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత నెల 29వ తారీఖున మధిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మధిరకు చెందిన పూసపాటి ఉమామహేశ్వరరావు మరియు వారి భార్య అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. ఎక్సైజ్ సిఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగిందన్నారు. అన్ని రకాల డాక్యుమెంట్లని సేకరించి విచారించి తప్పుడు ధ్రువ పత్రాలతో ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పూసపాటి ఉమామహేశ్వర రావు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. పూసపాటి ఉమామహేశ్వరరావు వలన ఎవరైనా బాధితులు ఉన్నయెడల పోలీస్ స్టేషన్లో సంప్రదించగలరని ఆయన కోరారు
Share this on your social network: