డిపిఆర్ఓ ను పరామర్శించిన పాత్రికేయులు

Published: Monday August 29, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు28 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారి (డిపిఆర్ఓ) కృష్ణమూర్తి మాతృమూర్తి పెద్దకర్మ (12వ రోజు) కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన నివాసం మంచిర్యాలలో కేబీ ఆసిఫాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ సంఘం నాయకులతో కలిసి డీపీఆర్ఓ కృష్ణమూర్తిని మంచిర్యాల్ కు వెళ్లి పరామర్శించారు. డిపిఆర్ఓ ను కలిసిన వారిలో పాత్రికేయులు ప్రకాష్ గౌడ్, సురేష్ చారి, దేవునూరి రమేష్, జాడే రాందాస్, నవీన్, తదితరులు ఉన్నారు.