ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ ప్రజాపాలన ప్రతినిధి. *ఎల్లమ్మ తండాలో వైయస్సార్13వ వర్ధంతి వేడు

Published: Saturday September 03, 2022

మంచాల మండలం స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ తండా గ్రామంలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులా మాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమనికి ముఖ్యఅధితిగా పాల్గొన్న రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు మరువ లేనివి అన్నారు ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా లక్ష రూపాయల లోపు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేసి రైతులను ఆదుకున్న గొప్ప నాయకుడు వైయస్సార్ పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇండ్లు పేద విద్యార్థుల కోసం పిజు రియంబర్స్ మెంట్ పథకం ప్రవేశ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు  ఆయన చేసిన సేవలు ప్రజలు ఎప్పట్టికి మరచిపోలేని వి అన్నారు ప్రతి ఒక్కరు వైయస్సార్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో
ఇబ్రహీంపట్నం మండలం యువజన విభాగం నాయకుడు
గోరెంకాల నందకుమార్ ముదిరాజ్
మంచాల మండలం సీనియర్ నాయకుడులొంగరి యాదగిరి, ఎస్సి సెల్ నాయకుడు బూడిద మహేందర్,
మండలం యువజన విభాగం నాయకుడు
కర్నాటి ముఖేష్ గౌడ్, సపవట్ శంకర్ నాయక్,
సపవట్ పాండు నాయక్, తదితరులు పాల్గొన్నారు,