అగ్రిమెంట్ లేని జడ్పి పనులు ప్రారంబించొద్దు : జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి

Published: Thursday September 30, 2021
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజాపాలన : జడ్పి గ్రాంటు కింద మంజూరైన అభివృద్ధి పనులకు అగ్రిమెంట్ కాకుండా పనులు చేయరాదని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అగ్రిమెంట్ కాకుండా పనులు పూర్తిచేశారని, అలాంటి వాటికి బిల్లులు చెల్లింపులో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. జడ్పిలోని ఏ గ్రాంటు నిధులైన మొదట అగ్రిమెంట్ చేసుకున్నాకే పనులు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఒకవేళ ఇలాంటి పనులకు తర్వాత అగ్రిమెంట్ చేస్తే సంబంధిత ఇంజినీర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.