బేబీ శాన్వితకు ఆర్థికసహయం

Published: Monday March 29, 2021

బెల్లంపల్లి, మార్చి 27, ప్రజాపాలన ప్రతినిధి : అసలే రెక్కాడితే కానీ డొ క్కాడని జీవితాలు, ఆ పైన ఆడపిల్ల, ఆ ముక్కుపచ్చలారని పసిపాపకు అ నుకొని కిడ్నీ కి సంబంధించిన జబ్బు,  వైద్యం కోసం  తిరిగి తిరిగి వేసారిన ఆ కుటుంబ పెద్దకు ఎం ల్ ఏ అందించిన ఆర్థికసహయంతో ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి నియోజకవర్గంలో ని తాండూరు మండలం  మాదరం టౌన్ షిప్ కు చెందిన ఎం సతీష్ కుమార్తె ( 2 ) కు గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం అందిస్తూ పరీక్షలు నిర్వహించగా కిడ్నీ కి సంబంధించిన వ్యాధి గా నిర్దారణ కాగా   ఖర్చుతో కూడిన వైద్యం కావడంతో దిక్కుతోచని స్థితిలో బెల్లంపల్లి ఎం ల్ ఏ దుర్గం చిన్నయ్య ను సంప్రదించగా పాప పరిస్తితి ని గమనించిన ఆయన వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ ల్లో చేర్పించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు అందించి తనఉదారతనిచాటుకున్నాడు.ఎప్పటికప్పుడు పాప ఆ రోగ్యపరిస్తితిని వారి తల్లిదండ్రులతో  సంబంధిత డాక్టర్ల తో తెలుసు కుంటూన్నాడు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎం ల్ ఏ  చేసిన సహాయానికి ఎం చేసిన ఆయన రుణం తీర్చుకోలేమని ముఖ్యమంత్రి కి ఎం ల్ ఏ దుర్గం చిన్నయ్య కు సహకరించి నఅధికారులకు, నాయకులకు ప్రతిఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.