భీమా నగదు అందజేత

Published: Thursday December 02, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘంలోని సంఘ సభ్యురాలికి బుధవారం నాడు భీమా నగదును అందజేశారు. బనిగండ్లపాడు గ్రామానికి చెందిన గ్రూపు సంఘ సభ్యుడు పటాపంచల శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందగా సభ్యుడి కి గ్రూపు ఇన్సూరెన్స్ రూ.50,000/- లను పెద గోపవరం సొసైటీ అధ్యక్షుడు శీలం అక్కిరెడ్డి చేతుల మీదుగా మృతుని భార్య ధనలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్రాంచి మేనేజర్ మగినం వీరభద్రం, బ్యాంక్ సూపర్ వైజర్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.