శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం
ప్రత్యేక పూజలు మధిర జనవరి ఒకటి ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లాది వాసు దంపతులు వర్తక సంఘం మధిర ఈరోజు ధనుర్మాస ఉత్సవంలో భాగంగా 17వ రోజ ఈరోజు మల్లాది వాసు దంపతులతో శ్రీ గోదా అమ్మవారికి మొదటి హారతి, మొదటి సారె ఇవ్వనైనది తదుపరి పురప్పాటు సేవ జరిగినది మల్లాది వాసు గారి దంపతులతో కవాట ఉద్ఘాటనం (ద్వారములు తెరుచుట) చేసి స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు తదుపరి పాసుర విన్నపం అష్టోత్తర పూజ సేవా కాలం తీర్థ గోష్టి నిర్వహించటమైనది పాసురము,కంఠమాల ను శ్రీమాన్ మిట్టపల్లి శ్రీనివాసరావు దంపతులు మరియు డోకుపర్తి ప్రసాద్ దంపతులు కుటుంబ సభ్యులచే సమర్పించబడినది తదుపరి ఆలయ మర్యాద వేద ఆశీర్వచనం నిర్వహించబడినది సాయంత్రం శ్రీ అమ్మవారికి ఊంజల్ సేవ దీపోత్సవం నిర్వహించబడును ఈ కార్యక్రమాలు శ్రీ రామ రామానుజా సుప్రభాత సంఘం మధిర వారి ఆధ్వర్యంలో మరియు అర్చక స్వామి శ్రీమాన్ ముత్తేవి సీతారామచార్యులు మరియు ముడుంబ రవి కిరణాచార్యులు చే కార్యక్రమము అత్యంత వైభవముగా నిర్వహించబడుచున్నది సాయంత్రం పూట ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి తీర్థప్రసాదాలు అందించారు
Share this on your social network: