జగిత్యాల టిడిపి జిల్లా కార్యాలయంలో జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు

Published: Tuesday June 22, 2021
జగిత్యాల, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆశాజ్యోతి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలపురుషుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ స్వయం పాలనా కోసం పరితపించిన తొలి వ్యక్తి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహా యోధుడని ఆయన ఆశయ సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన నిలిచి ఉన్నారని అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ఫలాలు అందాలనే ఆయన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దాయాల మల్లారెడ్డి కొండ శ్రీధర్ వనమాల నిరంజన్ కోరుకంటి రాము ఏలేటి సురేందర్ రెడ్డి అజ్గర్ ఖాన్ జున్ను మల్లయ్య బండ్ల యేసుబు తదితరులు పాల్గొన్నారు.