మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

Published: Tuesday April 12, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) : మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతిని పురస్కరించుకొని రామంతాపూర్ ప్రధాన రహదారిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు, దేశానికి పూలే అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోమ శేఖర్ గౌడ్, రఘుపతి గౌడ్, రేవు నరసింహ, తాళ్ల బాలకృష్ణ, వేముల వెంకట్ రెడ్డి, చిలక రాజు కరుణాకర్, నరసింహ రెడ్డి, జగదీష్, మహేందర్, వేముల కొండ వెంకన్న గౌడ్, సంకూరీ కుమారస్వామి, నారాయణ దాసు, చింతకింది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.