పకడ్బంధీగా జ్వరం సర్వేను చేపట్టాలి .
Published: Tuesday January 25, 2022
జడ్పిటిసి అరిగేల నాగేశ్వర్ రావు
ఆసిఫాబాద్, జనవరి 24, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న జ్వర సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాపు నగర్ లో డాక్టర్ సత్యనారాయణ తో కలిసి, వైద్య సిబ్బంది చేపడుతున్న జ్యర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించి, కోవిడ్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ తిరుగుతూ సర్వే చేయాలని జ్వరంతో ఉన్న వారిని గుర్తించి వారికి కిట్లను అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము గౌడ్, కోట వెంకన్న, సుగుణాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: