ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఎంపీడీఓ కు జేపీఎస్ లు వినతిపత్రం

Published: Friday March 19, 2021
గొల్లపల్లి, మార్చి18 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లి మండలపంచాయతి కార్యదర్శులు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వారి సమస్యలు విన్నవిస్తూ జేపీఏస్ లు ఉపాధిహామీ ఇతర అదనపు పనిఒత్తిడి భారాన్ని తగ్గించి ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని మరియు ప్రోభిషన్ కాలాన్ని రెండుసంవత్సరాలు తగ్గించి రెగ్యులర్ చేయాలని కోరుతు జేపీఎస్ లు ఎంపీడీఓ జనార్ధన్ కు వినతిపత్రం సంర్పించారు. ​సంగారెడ్డి జిల్లాలో జేపీఎస్  జగన్నాదం పనిభారం ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినందుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి అతనిఫొటోకు పూల మాలలువేసి ఆత్మకు శాంతి కలగాలని నివాళ్ళు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ లాంటి సంఘటన మళ్ళీ జగకుండా ప్రభుత్వం సానుకూల దృష్టి తోపరిశీలించి తగున్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ వెంకటేశ్వరరెడ్డి సూపరెండేంట్ రవీందర్ రావు సమస్త కార్యదర్శులు ఉపాధిహామీ అధికారులు తదితరులు పాల్గొన్నారు