రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి

Published: Wednesday May 04, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజికవర్గంలో పర్యటించిన మర్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా ఇబ్రహీంపట్నం ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి అనంతరం ఇబ్రహీంపట్నం కట్టపై బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు, మరియు మంచాల మండల కేంద్రములో ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం మంచాల మండలం తాళ్లపల్లి గూడలో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మరియు మంచాల ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన మర్రి నిరంజన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు, మరియు బసవేశ్వర జయంతి మరియు కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు డప్పుల  వాయిద్యాల మధ్య శాలువాతో ఘనంగా సన్మానించారు,  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ భూపతి గళ్ళ రాజు, మంచాల్ మండల్ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,  ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్, లింగం గౌడ్, కాస గణేష్ ,సంతోష్ కుమార్ గౌడ్, మధుకర్ రెడ్డి, శివ కృష్ణ, ప్రదీప్ రెడ్డి, మనోజ్ రెడ్డి, ఎమ్మెన్నార్ టీం సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు భక్తులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.