బిఆర్ఎస్ పార్టీ అందించే సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను గడప గడపకు చేరవెయ్యాలి మట్టపల్లి స

Published: Tuesday November 08, 2022
అశ్వాపురం (ప్రజా పాలన.)- 
 బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ అధ్వర్యంలో మండల యువజన విభాగం కమిటీ సభ్యులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్, పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు మరియు అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి మట్టపల్లి సాగర్ యాదవ్, పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్ హాజరైనారు. పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు మరియు అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి మట్టపల్లి సాగర్ యాదవ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అందించే సంక్షేమ పథకాలను, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధి పనులను ప్రతి గడప గడపకు చేరవేసేందుకు యువజన విభాగం కమిటీలోని ప్రతి సభ్యుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రచారాన్ని నిర్వహించాలని, రానున్న ఎన్నికల్లో రేగా కాంతారావు ని అత్యధిక మెజారిటీతో గెలుపొందెలా అడుగులు వెయ్యాలని, అశ్వాపురం మండలంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి యువజన విభాగం కమిటీ సభ్యులు తప్పకుండా పాల్గోని విజయవంతం చేయాలని, బిఆర్ఎస్ పార్టీ నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో యువకులు నడుచుకోవాలని, ప్రతి నెలకోసారి యువజన విభాగం జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకెల రమేష్, ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ నయిమ్, మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు వెన్న రంజిత్ కుమార్, గుగూలోత్ రవి, ప్రధాన కార్యదర్శి కోలా భాస్కర్, ప్రచార కార్యదర్శి జూపెల్లి కిరణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.