పేద వికలాంగునికి వీల్ చైర్ బియ్యం వితరణ. మధిర రూరల్

Published: Monday October 10, 2022
అక్టోబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు లైన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వారు
ఆధ్వర్యంలోఆర్కే ఫౌండేషన్ రెస్క్యూటిం చైర్మన్ దోర్నాల రామకృష్ణ సారథ్యంలో.. అతి దీన స్థితిలో రామాలయం వద్ద ఒక వికలాంగుని కుటుంబం నివాసం ఉంటుండగా.పది సంవత్సరాల నుంచి నడవలేని స్థితిలో ఉన్న సుబ్బారావు అనే వికలాంగునికి మానవత దృక్పథంతో ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ వీల్ చైర్ అందించడం జరిగింది. అదేవిధంగాలైన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ వారు రెండు నెలలకు సరిపోను బియ్యం అందించారు. ఈ సందర్భంగా ఎంతో ఆనందంగా వీల్ చైర్ స్వీకరించిన సుబ్బారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బయటకు వెళ్లాలన్న హాస్పిటల్ కి వెళ్లాలన్న నలుగురు సహాయం అవసరం పడుతుంది. వీల్ చైర్ వల్ల నేను ఎక్కడికి వెళ్లాలన్నా సునాయాసంగా ఇప్పుడు వెళ్ళగలను అంటూ ఆనందభాష్పాలతో ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి లైన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ అధ్యక్షులు లయన్ చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి లయన్ కుంచం కృష్ణారావు, కోశాధికారి లయన్ కాజా కిరణ్ కుమార్, లయన్ కురువెళ్ల వెంకట పురుషోత్తమరావు, లయన్ వనమా కిరణ్ కుమార్, లయన్ వంగవీటి రాజశేఖర