మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించిన ప్రాంతీయ సమన్వయ అధికారి

Published: Wednesday July 13, 2022
కోరుట్ల,జూలై 12 ( ప్రజాపాలన ప్రతినిధి ): 
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఐలాపూర్ లోని మహాత్మ జ్యోతిబా పూలే (బాలురు) గురుకుల పాఠశాలను ప్రాంతీయ సమన్వయ అధికారి  అర్సిఓ  గౌతమ్ రెడ్డి  మరియు స్తంభంపల్లి ప్రిన్సిపాల్ రాజేశం లు మంగళవారం రోజున సందర్శించారు. విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రిన్సిపల్ కు ఆదేశించారు. వీరితోపాటు ప్రిన్సిపాల్ సంతోషిని మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.