కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Saturday February 06, 2021
మధిర ఈరోజు టి ఎస్ ఆర్ టి సి మధిర డిపో నందు ఆర్టీసీ ఉద్యోగస్తులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగస్తుల ఉద్యోగ భద్రత విషయమై గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన విధి విధానాల పట్ల ఆర్టీసీ ఉద్యోగస్తులు తమ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీ జీ.వి. సూర్యనారాయణ గారు, ట్రాఫిక్, గ్యారేజి సూపర్వైజర్లు, ఆఫీసు సిబ్బంది, కండక్టర్లు, డ్రైవర్లు మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.