ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించుటకు ప్రధానోపాధ్యాయులకు సర్టిఫికెట్స్ అందజేసిన జెడ్పీ

Published: Friday July 01, 2022

జగిత్యాల, జూన్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ ఆధీనంలో పనిచేయుచున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించుటకు జిల్లా పరిషత్ ద్వారా ఆమోదించబడిన 6 అండర్ టేకింగ్ సర్టిఫికెట్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయులకు జిల్లా ప్రజా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుందర వరథరజన్, ప్రధానోపాధ్యయులు, జెడ్పీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.