కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన కార్పోరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్

Published: Wednesday October 27, 2021

మేడిపల్లి, అక్టోబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మికశాఖ మంత్రి  చామకూర మల్లారెడ్డి పాల్గొని మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో కలిసి అయ్యా డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ మేరకు 22వ డివిజన్ కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ డివిజన్లోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.