బిజెపి శ్రేణులు అందరూ పార్టీ సిస్టమ్ లో కొనసాగాలన్నారు

Published: Wednesday July 14, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : ప్రతి చోట బిజెపి గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు. బాలాపూర్ మండలం బాలాపూర్ నివాసులైన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మంగళవారం నాడు బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీ.కే అరుణ హైదరాబాదులో ఉన్న స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి  రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాల పరిస్థితులు పై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రతి చోట బిజెపి గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. ఎన్నికలలో టిక్కెట్టు ఎవరికి అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అందరూ పార్టీ సిస్టమ్ లో కొనసాగాలన్నారు. పార్టీకి త్యాగం చేసి, అభివృద్ధికి ప్రజాసేవలో ఉన్న వారికి పెద్దపీట తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహేష్, ఏం ప్రభాకర్ రెడ్డి, కె వెంకట్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.