పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: మున్సిపల్ చైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి

Published: Monday June 21, 2021
బొల్లారం మున్సిపల్ పరిధిలో ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారాం ప్రతి ఆదివారం "పది గంటల పది నిమిషాలు" కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి, ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అలాగే చుట్టూ ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చూసుకొని అంటూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలని ఇది అందరి బాధ్యతని ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేంద్ర కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినోద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.