రక్షణ గిరి పుణ్యక్షేత్ర తిరునాళ్లు ప్రారంభం....

Published: Tuesday February 01, 2022
ఎర్రుపాలెం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం మండలం లోని అయ్యవారిగూడెం గ్రామంలో ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రం రక్షణ గిరి తిరునాళ్లు రేపే ప్రారంభం అవుతున్నట్లు డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ సూరేపల్లి ఐజాక్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులందరూ ప్రశాంతంగా దేవుణ్ణి పూజించుటకు అన్ని జాగ్రత్తలు తీసుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం పీఠాధిపతులు మైపాన్  పాల్ పతాకావిష్కరణ తో  ప్రారంభించి, నూతనంగా భక్తుల కొరకు నిర్మించిన మంచినీటి సౌకర్య, స్నాన వాటికలను బిషప్ ఆశీర్వదిస్తారని డైరెక్టర్ తెలిపారు. భక్తులు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో పుణ్యక్షేత్రాన్ని దర్శించి దేవుని ఆశీస్సులు పొందు కోవాలని కోరారు. ఈ సందర్భంగా మంగళ బుధవారాల్లో బైబిల్ నాటకం గ్రూప్ డాన్స్ పోటీలు మేరీ మాత తేరు ఊరేగింపు జరుగుతుందని, చివరి రోజు గురువారం కొండపై అనేకమంది అభిషేకించబడిన క్రైస్తవ గురువులతో భక్తుల కొరకు మరియు దేశ క్షేమాభివృద్ధి కొరకు దివ్య పూజ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఫాదర్ ఐజక్ సూరేపల్లి తెలిపారు.