రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నీలి జెండా ఎగురుతుంది -- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Published: Wednesday September 21, 2022
 బహుజన సమాజ్ పార్టీతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుంది
 
* బిజెపి, టీఆర్ఎస్ ను ఓడించడానికే మునుగోడులో బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభిస్తున్నాం
 
చౌటుప్పల్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): దేశంలో మత విద్వేషాలు సృష్టిస్తున్న బిజెపి ని అవినీతి టిఆర్ఎస్ ను అంతం చేయడం కోసం మునుగోడు నియోజకవర్గంలో బహుజన రాజ్య అధికార యాత్రను ప్రారంభిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం గ్రామ శివారులో ఉన్న ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఎస్పీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు డప్పుల వాయిద్యాలతో బతుకమ్మ కోలాట పాటలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.75 సంవత్సరాలుగా ఈ ఆధిపత్య వర్గాల చేతుల్లో మునుగోడు నలిగిపోయి ఉన్నదని ఏ దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారో. అదే దొరలు టిఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో, బిజెపిలో, ఉన్నారని వాళ్లే మళ్లీ ఈ మునుగోడు గడ్డను ఏలడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. మునుగోడు లో ఉండే సబ్బండ వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అగ్రవర్ణంలో ఉండే పేదలు వాళ్లందరి జీవితాలను రక్షించడం కోసం మునుగోడు గడ్డను కాపాడుకోవడం కోసం మునుగోడు గడ్డను ఆ బందీ ఖానా నుంచి విముక్తి చెందడం కోసం రాజ్యధికార యాత్రను మునుగోడు నుంచి మంగళవారం ప్రారంభిస్తున్నాం అన్నారు. రాబోవు రోజుల్లో మునుగోడులో గెలవడమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా నీలి జెండా ఎగరవేస్తాం అని అన్నారు. తెలంగాణని ఈ దొరల పాలన నుండి బంధికానా నుండి విముక్తి చేసి ప్రజలందరికీ కూడా ఒక చక్కటి పాలన అందిస్తాం అని తెలియజేశారు. తెలంగాణలో ఉండే ఆదిపత్య దోపిడి పార్టీల్లో బందీలైన బహుజన బిడ్డలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఆందోల్ మైసమ్మ తల్లిని అదే కోరుకున్నని అన్నారు. తెలంగాణలో మా బహుజన బిడ్డలందరికి జ్ఞానోదయం కలిగించి వాళ్లందర్నీ కూడా బహుజన సమాజం వైపు నడిపించాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. బహుజన సమాజాన్ని నిర్మించు. రాబోవు కాలంలో మన బహుజన బిడ్డలను బ్రతుకులను బాగు చేయని. ఆందోల్ మైసమ్మ తల్లిని కోరుకున్ననని అన్నారు. ఆదిపత్య పార్టీలో ఉన్న మా బహుజన నాయకులు బహుజన సమాజ్ పార్టీలో చేరాలన్నారు. మునుగోడుపై ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి రాష్ట్ర కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, చంద్రశేఖర్ ఆజాద్, బి ఎస్ పి పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఉప్పల జహంగీర్, ఉపాధ్యక్షులు కనుకుంట్ల పాండు, నల్గొండ జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్, ఉపాధ్యక్షులు ప్రసాద్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు పల్లె లింగస్వామి, మహిళా కన్వీనర్లు మేడి ప్రియదర్శిని, నర్ర నిర్మల, కవిత, గాదే సంతోష, మామిడి కల్పన, కత్తుల పరమేష్, బలికే నరసింహ, గడ్డమీది బాబు, కత్తుల పద్మ, గాదె సంతోష, తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area