*విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారానికై 16న ఆర్ డి ఓ ఆఫీసు ముందు ధర్నా*

Published: Thursday December 15, 2022
విజయవంతం చేయాలనీ  పి డి ఎస్ యూ  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పిలిపు.

చేవెళ్ల డిసెంబర్ 14, (ప్రజాపాలన):-

విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మరియు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని.  పి డి ఎస్ యూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అన్నారు  ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దానితోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలని , కార్పొరేటు ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు దోపిడీని అరికట్టాలని , అనుమతులు లేని పాఠశాలలను గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16 తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని  ఆర్ డి ఓ  ఆఫీసులో ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో PDSU జిల్లా కార్యదర్శి కే,రాజేష్, చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి, కోజ్జంకి జైపాల్, బొజ్జి శ్రీకాంత్, సురేష్, ప్రసాద్,తదితరులు ఉన్నారు.