వ్యాదుల వ్యాప్తి నివారణ పై అవగాహన సదస్సు

Published: Saturday June 11, 2022

జన్నారం రూరల్, జున్ 10, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా  జన్నారం మండలం రాంపూర్ గ్రామంలో  మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ప్రజలకు అవగాహన సదస్సు చేయడం జరిగిందని స్థానిక కార్యదర్శి గంగారాం  అన్నారు. శుక్రవారం రాంపూర్ గ్రామంలో సిజనల్ వ్యాదుల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు పరిశుభ్రత పాటించాలని , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.  కార్యక్రమంలో ఏపిఎం బుచ్చన్న, కమలాకర్, మాధవి, ఆశాలు రాజమణి, వసంత, గ్రామస్తులు పాల్గొన్నారు.