బంజారా భవన్ ప్రారంభోత్సవ సభ విజయవంతం చేయాలి --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

Published: Friday September 16, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 15 ( ప్రజాపాలన ప్రతినిధి): బంజారా భవన్ ప్రారంభోత్సవ సభ విజయవంతం చేయాలని ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా బంజారా జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సెప్టెంబర్ 17 న హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా బంజారా భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆవో బంజారా చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించి సభను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విజయవంతం చేయాలని అన్నారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పాటు పడుతున్నారు అని అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో నూతనంగా 12 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారని రాష్ట్ర మొత్తంలో మూడు వేలకు పైగా నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారని తద్వారా గిరిజనులు రాజకీయంగా వారి పాలన వారు చేయాలని ముఖ్యమంత్రి అలోచన అని దానిలో భాగంగానే నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు కారణం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అందజేసిన ఆర్ఓఆర్ భూములకు సైతం రైతు బందు వర్తింపజేశారు అని అన్నారు. రాష్ట్రం ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నారు అని, హాస్టల్ వసతి కోసం నూతన కలెక్టర్ తో కలిసి స్థలం ఎంపిక చేశామని భూమి పూజ కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు  సురేందర్ నాయక్, తిరుపతి నాయక్, జవహర్ నాయక్, నందు నాయక్, బాపురావు, దశరథ నాయక్, తదితరులు పాల్గొన్నారు.