ఘనంగా సిఐటియు 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మంచిర్యాల టౌన్, మే 30, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రోజున సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు, ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిఐటియు 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చిప్పకుర్తి కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నేడు కార్మిక రంగం అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ, కార్మిక హక్కులకై పోరాడుతూ, సామాజిక సమస్యల పైన ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఏకైక కార్మిక సంఘం సిఐటియు అని అన్నారు.సమాన పనికి సమాన వేతనం అమలు పరిచేందుకు, పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, సుమలత, నరేష్, దుర్గయ్య, క్రాంతి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: