లలితమ్మకు నివాళులర్పించిన జడ్పీటీసీ ప్రమీల..

Published: Saturday November 26, 2022
తల్లాడ, నవంబర్ 25 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ పట్టణానికి చెందిన ప్రముఖ హోటల్ నిర్వాహకులు పోరంకి లలితమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.  ఆమె దశదినకర్మ శుక్రవారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు దంపతులు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందరితో ఆప్యాయంగా ఉండే ఆమె మరణం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప, సానుభూతిని ప్రకటించారు.  వారి వెంట కుటుంబసభ్యులు శ్రావ్య, జ్యోతి, బాలాజీ, శివ ఉన్నారు.