మధిర నియోజకవర్గం లో తిరుగులేని శక్తిగా బిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కరెం

Published: Wednesday February 22, 2023
బోనకల్, ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి: మదిర నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు
 జానికిపురం లో సోమవారం రాత్రి జరిగిన ముఖ్యకర్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడినీ ప్రతి కార్యకర్తని బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని,ప్రజలకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది అని ముఖ్య కార్యకర్తల సమావేశానికి అశేషంగా తరలివచ్చిన ప్రతి కార్యకర్తకు శుభాకంక్షలు తెలియజేస్తూ తెలంగాణా ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు ఏవిధంగా గ్రామాలు ఉండేవో ఒక్క సారి అత్మ పరిశీలన చేసుకోవాలనీ,ఎరువుల కోసం లాటి దెబ్బలు ఉన్నాయా.. అర్థరాత్రి అపరాత్రి పొలాలకు పోయే పరిస్థితి ఇప్పుడు ఉందా.. కరంట్ కోసం అర్దరాత్రి సబ్ స్టేషన్ ల ముందు ధర్నాలు ఉన్నాయా.. తాగునీటి, సాగునీటి సమస్యలు ఉన్నాయా... గ్రామలలో నివసిస్తున్నా రైతులు ఆర్ధిక పరిస్థితి ఏ విధంగా మెరుగు పడ్డాయి ఆలోచన చెయ్యాలనీ, తెలంగాణా ఏర్పడక ముందు పేదవాడు కూటికి గుడ్డకి కూడ బాధ పడ్డ కుటుంబాల ఉన్నాయి కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదనీ,దళితులు దరిద్ర రేఖను పార ద్రోలలి అనే పెద్ద సంకల్పం తో చింతకాని మండలం లో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా పెట్టిన మహా నేత కెసిఆర్ అని, రానున్న రోజుల్లో బోనకల్ మండలానికి కూడ దళిత బందు పథకం వస్తుందనీ, దానికి కారణం కెసిఆర్ పాలన కావున అలాంటి మహా నాయకుడికి మనమందరం అండగా ఉండి మనందరి చల్లని దీవెనలు కెసిఆర్ కి ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.